YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీ సీనియర్ నేతలతో బండి సంజయ్ భేటీ

పార్టీ సీనియర్ నేతలతో బండి సంజయ్ భేటీ

పార్టీ సీనియర్ నేతలతో బండి సంజయ్ భేటీ
పాదయాత్ర నిర్వహణకు పలు కమిటీలు
హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన పార్టీ  సీనియర్ నేతల సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర గురించి సీనియర్ నేతలకు సంజయ్  వివరించారు. క్విట్ ఇండియా’ నాటి పరిస్థితులే రాష్ట్రంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టి ‘ప్రజా స్వామిక తెలంగాణ’ ఏర్పాటు లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్న బండి సంజయ్, పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండే పాదయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. పాదయాత్ర విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీనియర్ నేతల నుండి  అభిప్రాయాలు కోరారు. పాదయాత్ర విజయవంతం కోసం 25కమిటీలు వేయాలని నిర్ణయించారు. పాదయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక ఇంఛార్జ్, ఇద్దరు లేక ముగ్గురు కో ఇంఛార్జ్ లు వుంటారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యచరణ రూపోందిస్తున్నారు. పాదయాత్రకు కేంద్ర మంత్రులను, జాతీయ నేతలను ఆహ్వానానికి ప్రత్తేక కమిటీ  ని ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు 9న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుండి ప్రారంభంకానున్న బీజేపీ అధ్యక్షుడి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

Related Posts