YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వాటర్ ట్యాంక్ ఎక్కాడు పురుగుల మందుతో హల్ చల్ చేసాడు

వాటర్ ట్యాంక్ ఎక్కాడు పురుగుల మందుతో హల్ చల్ చేసాడు

వాటర్ ట్యాంక్ ఎక్కాడు
పురుగుల మందుతో హల్ చల్ చేసాడు
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ ఎక్కిని దాసరి చంద్రమౌళి పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేసాడు. చేపల చెరువు విషయంలో  కుల బహిష్కరణ చేసారని చంద్రమౌళి ఆరోపణ.  మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నుండి 7 కుటుంబాలకు చెందిన వారిని చేపల చెరువు విషయం లో కుల బహిష్కరించినందుకు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కాడు.  9 నెలల నుండి మా 7 కుటుంబాల్లోని సుమారు 35 మందికి ముదిరాజ్ సంఘము నుండి కుల బహిష్కరించి మాకు రావాల్సిన బెనిఫిట్ లకు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. కుల సంఘాల నాయకుల  పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినాన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ  మనస్తాపానికి గురై మందు డబ్బా తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు.

Related Posts