ప్రొటోకాల్ పాటించక పోవడం పట్ల హైదరాబాద్ నగర మేయర్ అసంతృప్తి
హైదరాబాద్ జూలై 13
ప్రొటోకాల్ పాటించక పోవడం పట్ల హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే పనులు జరుగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేసారు.కొన్ని ఇంజినీరింగ్ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే, తనకు ఆహ్వానం లేకుండానే జరగడంతో ప్రొటోకాల్ పాటించడం లేరని అసహనానికి గురైన మేయర్ విషయాన్ని కమిషనర్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు తెలియజేశారు.వివరణ కోరుతూ కమిషనర్ లోకేశ్కుమార్ సదరు పనులు జరిగిన నాలుగు జోన్లకు చెందిన డీఈఈలు, ఈఈలతో పాటు ఎస్ఈలకు కూడా మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.