YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ లో బిజీ బిజీగా అఖిలేష్

హైద్రాబాద్ లో బిజీ బిజీగా అఖిలేష్

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం, ఫెడరల్ ఫ్రంట్‌పై ఆయన సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో ఇరువురు నేతలు చర్చలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్‌కు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి అఖిలేశ్‌ నేరుగా తలసాని ఇంటికి బయలుదేరి వెళ్లారు. అక్కడ అఖిలేశ్ కోసం మంత్రి తలసాని తేనీటి విందు ఏర్పాటు చేశారు. 

బేగంపేట విమానాశ్రయం నుంచి తలసాని ఇంటి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకోనున్న అఖిలేశ్.. సీఎం కేసీఆర్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు.దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ప్రకటించారు. మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేసీఆర్.. ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌తో చర్చలు జరిపారు.

Related Posts