YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్పీకర్ కోడెల డైనమిక్ : ఉప ముఖ్యమంత్రి కేఈ

స్పీకర్ కోడెల డైనమిక్ : ఉప ముఖ్యమంత్రి కేఈ

స్పీకర్ కోడెల శివప్రసాదరావు డెనమిక్.  ఏదైనా పని అనుకున్నారంటే నిద్ర పోరు. అయన అధ్వర్యంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి కొనియాడారు. సత్తెనపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఒక్కరోజే  స్పీకర్ కోడెలతో కలసి సబ్ స్టేషన్, రిజిస్ట్రార్ ఆఫీస్, విస్తరించిన రోడ్లు, వంద పడకల హస్పటల్ ప్రారంభించారు. కే ఈ మాట్లాడుతూ స్పీకర్ రాకముందు తోడేళ్ళ రాజ్యంగా ఉన్న నరసరావుపేట ఇప్పుడు కుందేళ్ల రాజ్యంగా మారింది. రాష్ట్రంలో ఏటీఎంలలో డబ్బులు రాని పరిస్థితి. మోడీ ఏ రాష్ట్ర మంలో ఎలక్షన్స్ ఉంటే అక్కడికి డబ్బులు తరలిస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను తప్ప కేంద్రం ఇంకే రాష్ట్రాలనూ పట్టించుకోవడం లేదని అయన విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం నిన్న సీఎం  చేసిన దీక్ష కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మారధం పట్టారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆర్థిక లోటులో సైతం రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకువెళుతుంది. సీఎం చంద్రబాబు కు  స్పీకర్ కోడెల కుడిచెయ్యి అని అయన అన్నారు. 

Related Posts