YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ కార్మికులకు అండగా వైకాపా

స్టీల్ కార్మికులకు అండగా వైకాపా

విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటు పరం కానివ్వం. కార్మికులకు అండగా వుంటామని ఎంపి ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ స్టీల్ .త్యాగాలతో సాధించుకున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రవేటైజేషన్ కాకుండా అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్మికనాయకులతో ఎయిర్ పోర్టులో చర్చలు జరిపి...కేంద్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి లెటర్స్ రాపారని అన్నారు. ఈ నెల 15 న ఎంపిలు అందరం ముఖ్యమంత్రి వ్తెఎస్ జగన్మోహనరెడ్డి తో సమావేశం అవుతున్ఆం. భవిష్యత్ కార్యచరణ ప్తె ప్రణాళిక రూపోందిస్తామని అన్నారు. కార్మిక నాయకులతో కలిసి కేంద్ర మంత్రులను ఈ నెల 20 న కలవనున్నాం. కార్మికులు డిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఈ రోజు సర్క్యూటా హౌస్ లో రాజ్యసభసభ్యులు విజయసాయిరెడ్డి తో కార్మిక నాయకులు సమావేశం కూడా జరగనుంది. వైఎస్సార్ కాంగ్రేస్ పూర్తిగా విశాఖ ఉక్కును కాపాడేందుకు కార్మికులకు అండగా నిలుస్తుందని అయన అన్నారు.

Related Posts