హైదరాబాద్
హుజురాబాద్ ఉప్ ఎన్నికల నేపధ్యంలో అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్యెల్సి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లు వుంటారు. ఇక వీణవంక మండలం ఇన్ చార్జీగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావు, రాజ్ ఠాగూర్, హుజురాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్, హుజురాబాద్ టౌన్ కు బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు లు, ఇల్లంతకుంట మండలం కు నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య, కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ లను నియమించారు.