YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేగవంతమయిన పోలవరం పనులు

వేగవంతమయిన పోలవరం పనులు

పోలవరం
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ సాకారం దిశగా అడుగులు వేస్తోంది. పనులు వేగంగా జరుగుతు న్నాయి.మేఘా ఇంజనీరింగ్ అండ్  ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ సంస్థ  అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ అధికారుల సహకారం, పర్యవేక్షణతో పనులు ప్రకృతి విపత్తులను ఎదుర్కొ ని ముందుకు సాగుతున్నాయి. ఒకవై పు భారీ వరదలు,మరోవైపు కలవర పెడుతున్న కరోనా... కానీ పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో ఊపందుకున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు ప్రభుత్వం, అధికారుల సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ లో అంచనాలను మించి పనులు జరుగుతున్నాయి.పోలవరం పనులు మేఘా సంస్థ చేపట్టిన తరువాత వేగం పుంజుకుంది. సీఎం ఆదేశాలు, అధికారుల సహకారం, ఎంఈఐఎల్ సంస్థ వేగం వెరశి పోలవరం నిర్మాణం ఉరుకులు, పరుగులు పెడుతున్నా యి.

Related Posts