దుబ్బాక
మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీ కి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్స్ సొంత గూటికి చేరుకున్నారు. వారికి కండువా కప్పి మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. మంగళవారం నాడు నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇద్దరు కౌన్సిలర్లు దివిటి కనకయ్య (7వ వార్డ్), డి. బాలకృష్ణ (8వ వార్డ్) బీజేపీలో చేరారు. వారిద్దరూ బుధవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ప్రగతి ప్రభుత్వం కె జై అంటూ.. అభివృద్ధి చేస్తున్న టి ఆర్ ఎస్ పార్టీ లోనే ఉంటాం అంటూ పార్టీ లో చేరారు..