నర్సాపురం
దేశం మొత్తం కరేనా తో పోరాడుతుంటే సామాన్యుడి నడ్డి తెరిచే లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పెంచిన రేట్లతో పోరాడుతున్నానని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణ కాంగ్రెస్ నాయకుడు కానూరు బుజ్జి అన్నారు. ఈరోజు పట్టణంలో తిరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని పెట్రోల్ బంక్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అని ఒక ప్రక్క కరోనా మరోపక్క పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు మూలంగా నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని. లీటర్ పెట్రోల్ 107-40 రూ.పై లు అవడం మూలంగా రవాణా చార్జీలు కూడా పెరిగాయని పెంచిన ధరలు మూలంగా ప్రజలపై పెనుభారం పడుతుందని .కాబట్టి వెంటనే పెంచిన ధరలను నియంత్రించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం ఆగదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.