YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ స్వల్ప లాభంతో ముగిసినప్పటికీ, నిఫ్టీ మాత్రం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆరంభం నుంచి సూచీలు స్వల్ప లాభ నష్టాలతో కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 16.06 పాయింట్ల లాభంతో 35,176.4 వద్ద, నిఫ్టీ 21.40 పాయింట్ల నష్టంతో 10718 పాయింట్ల వద్ద నిలిచాయి. బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. బంగారం ధర 58.0 (0.19) పెరుగుదలతో రూ.30,987 వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.69 వద్ద ట్రేడవుతోంది. కొటక్‌ మహీంద్రా, అమరరాజ బ్యాటరీ, క్యాస్ట్రోల్ ఇండియా, గోద్రెజ్ ఇండియా, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, సెయిల్, హిందూస్థాన్ జింక్, వేదాంత, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, ఐడియా సెల్యూలార్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

Related Posts