YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రమంత్రి అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో బండి సంజయ్ భేటీ
న్యూఢిల్లీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.  తెలంగాణలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలపై వీరు చర్చించారు.  ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల అంశం వీరి మధ్య చర్చకొచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కష్టపడాలని అమిత్ షా సూచించారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అమిత్ షా తెలిపారు.  బండి సంజయ్ ఆగస్టు 9 నుండి చేపడుతున్న పాదయాత్ర వివరాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ కూడా సమావేశంలో ఉన్నారు.

Related Posts