YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ వార్

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ వార్

కర్ణాటక పోలింగ్ దగ్గరపడే కొద్ది కర్ణాటక రాజకీయం మరింత హీట్ పెంచుతున్నాయి. ప్రచారంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌ అన్న రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న బీజేపీ ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ... రాహుల్ టార్గెట్‌గా మాటల తూటాలు పేల్చారు. ఏ పేపర్ లేకుండా కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో... 15 నిమిషాలు పాటూ ఏ భాషలోనైనా మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. మళ్లీ రివర్స్‌లో మోదీకి ఆయన సవాల్ విసురుతూ ట్వీట్ చేశారు.మోదీజీ... నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను... యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో చేసిన అభివృద్ధి గురించి 15 నిమిషాలు పాటూ పేపర్ చూస్తూనే మాట్లాడండి అంటూ సవాల్ చేశారు. సిద్ధ రామయ్య చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్ నేతలు రీ ట్వీట్ చేస్తుండగా... బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కూడా ట్విట్టర్‌లో పెద్ద వార్ నడుస్తోంది. బీజేపీ నేతలు సిద్ధరామయ్య ప్రచారంలో నిద్రపోతున్న ఫోటోలను చేశారు. దీనికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా మోదీ పార్లమెంట్‌లో కునుకు తీస్తున్నట్లుగా ఉన్న ఫోటోలతో కౌంటర్ ఇస్తున్నారు. 

Related Posts