అజారుద్దీన్ పర్యటన
రంగారెడ్డి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని తోరుర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి గురువారం పర్యటించారు. తరువాత మల్రెడ్డి రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల తో కలిసి మాట్లాడారు. అక్కడ ఉన్న క్రికెట్ టీం సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. అజారుద్దీన్ మాట్లాడుతూ ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తోరుర్ లో మల్రెడ్డి రంగారెడ్డి తో పర్యటించి కార్యకర్తలని కలవడం సంతోషం గా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అధికారం లోకి రావడం కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు.