YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

క్షుద్ర పూజల పేరుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

క్షుద్ర పూజల పేరుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అనంతపురం
క్షుద్ర పూజలు చేశారంటూ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజక వర్గ పరిధిలోని ఓ.డి చెరువు మండలం చౌడంపల్లి లో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మన్న కుమారుడు మునీంద్ర క్షుద్ర పూజలు చేశారనే నెపంతో అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు వర్గం పరస్పరం దాడులకు దిగారు. కట్టెలు, గొడ్డళ్ళతో దాడులు చేసుకోవడంతో రామాంజనేయులు వర్గంలో ప్రసాద్, రామాంజనేయులు, ప్రదీప్, లక్ష్మన్న వర్గంలో లక్ష్మన్న లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని హుటాహుటిన 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణం అమ్మాయిలతో ఇవ్ టీజింగ్ కి పాల్పడుతున్న నేపథ్యంలో ఇరువురు దాడులు చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ గోపీని వివరణ కోరగా క్షుద్ర పూజలు ఏమి జరగలేదన్నారు. వ్యక్తిగత కక్షలతోనే పరస్పర దాడులు జరిగాయని ఇరువర్గాల పై  కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Related Posts