YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

థ‌ర్డ్ వేవ్ ప్రమాదముంది.. విధిగా నిబంధ‌న‌ల‌ను పాటించాలి

థ‌ర్డ్ వేవ్ ప్రమాదముంది.. విధిగా నిబంధ‌న‌ల‌ను పాటించాలి

న్యూఢిల్లీ జూలై 16
థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌నే ఆందోళ‌నల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌ల‌ను విధిగా పాటించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కోరారు.  క‌రోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఒడిషా, కేర‌ళ రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. మొత్తం కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల నుంచే వెలుగుచూస్తుండ‌టంతో ఆయా రాష్ట్రాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌నే అల‌స‌త్వం ప‌నికిరాద‌ని సూచించారు. మ‌నం థ‌ర్డ్ వేవ్ దేశాన్ని తాకుతుంద‌నే అంచ‌నాల న‌డుమ ఉన్నామ‌ని, 80 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే న‌మోద‌వుతున్న క్ర‌మంలో సెకండ్‌వేవ్ ఆరంభంలో ఉన్న ప‌రిస్థితి ప్ర‌స్తుతం నెల‌కొంద‌ని పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్ ముంచెత్త‌నుంద‌నే అంచ‌నాల న‌డుమ కేసుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలు వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని కోరారు.ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కాంటాక్టు ట్రేసింగ్‌, చికిత్స, వ్యాక్సినేష‌న్‌ల‌పై దృష్టిసారించాల‌ని అన్నారు. కేంద్రం ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌ని కొవిడ్ అత్య‌వ‌స‌ర ప్యాకేజ్ నిధుల‌ను ఉప‌యోగించుకుని రాష్ట్రాలు త‌మ ఆరోగ్య మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుపరుచుకోవాల‌ని ప్ర‌ధాని సూచించారు.

Related Posts