YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ జూలై 16
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని దన్మార్‌ ప్రాంతంలో ఉన్న ఆలమ్‌దార్‌ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరణించినవారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని చెప్పారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.

Related Posts