YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మామిడి దినోత్సవం జయప్రదం చేయాలి

మామిడి దినోత్సవం జయప్రదం చేయాలి

మామిడి దినోత్సవం జయప్రదం చేయాలి
చిత్తూరు
ఈనెల 23వ తేదీన నిర్వహించే ప్రపంచ మామిడి దినోత్సవం జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయాలని శుక్రవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కరపత్రాలు విడుదల చేశారు . అనంతరం ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జనార్థన్,  జిల్లా కార్యదర్శి నరసింహులు, మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన చిత్తూరు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రపంచ మామిడి దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  చిత్తూరు జిల్లా మామిడి పంటల సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు . మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ సీజన్లో జిల్లాలో రైతుల సుమారు 2 వేల కోట్ల వరకు నష్టపోయారన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేంద్రనాధ్  ,   మునిరత్నం,  విజయ రెడ్డి,  పద్మనాభ నాయుడు,  తదితరులు పాల్గొన్నారు.

Related Posts