YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తెలంగాణలో తెలుగు తప్పని సరిచేస్తూ నోటిఫికేషన్

తెలంగాణలో తెలుగు తప్పని సరిచేస్తూ నోటిఫికేషన్

ఇకపై రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను బోధించడం తప్పనిసరికానుంది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావాలని తెలిపారు. తెలుగు భాషా బోధనకు సిలబస్ తయారీ బాధ్యతను తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల స్థాయిల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని సీఎం ఆదేశించారు.ఈ మేరకు చట్టం అమలు తేదీని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ చట్టం ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలుగు అమలు తేదీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల ఆదేశించారు.

Related Posts