YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

5 జీపై వేగంగా అడుగులు

5 జీపై వేగంగా అడుగులు

టెలికాం రంగంలో తిరిగి జవజీవాలు నింపుతామని నూతన టెలికాం విధాన ముసాయిదా వాగ్దానం చేసింది. అందరికీ 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్, 5జి సర్వీసులు కల్పించాలని ప్రతిపాదించింది. ఈ రంగంలో 2022 నాటికి 40 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. అంతర్జాతీయంగా అమలులో ఉన్న ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా దాన్ని తెచ్చేందుకు స్థూలంగా ఒక రోడ్‌మ్యాప్‌ను ఈ ముసాయిదా అందించింది. పెట్టుబడులు, పరికల్పనలు, వినియోగదార్ల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న  రెగ్యులేటరీ ప్రతిబంధకాలను తొలగించేందుకు, రెగ్యులేటరీ భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని ముసాయిదా వాగ్దానం చేసింది. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే నిబంధనలను దీనిలో పొందుపరుస్తారు. రెగ్యులేటరీ సంస్కరణల సహాయంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్ల రంగంలో 100 బిలియన్ అవెురికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. లెసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వాడక చార్జీలు, యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీ వంటివన్నీ టెలికాం సర్వీసుల ఖరీదును పెంచుతున్నాయి. వాటిని సమీక్షించనున్నట్లు ముసాయిదా ప్రకటించింది. భారతదేశపు జి.డి.పికి ఈ రంగ కంట్రిబ్యూషన్ 2017లో సుమారు 6 శాతంగా ఉంది. దాన్ని 8 శాతానికి పెంచాలని సంకల్పించింది. డిజిటల్ కమ్యూనికేషన్లకు సరసమైన ధరకు స్థిరమైన యాక్సెస్ కల్పించేందుకు ‘‘స్పెక్ట్రమ్ ధరను సర్వోత్తమమైన’’ రీతిలో రూపొందించాలని ప్రతిపాదించింది. అధిక స్పెక్ట్రమ్ ధర, సంబంధిత చార్జీలు టెలికాం సర్వీసుల విభాగానికి ప్రధాన సమస్యగా ఉన్నాయి. టెలికాం సర్వీసుల రంగం దాదాపు రూ. 7.8 లక్షల కోట్ల రుణ భారంతో కునారిల్లుతోంది. మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గుర్తించాలని, ముఖ్యంగా తదుపరి నెట్‌వర్క్‌లకు 3గెగాహెర్ట్జ్, 24 గెగాహెర్ట్జ్ రేంజ్ కల్పించాలని ముసాయిదా ప్రతిపాదించింది. ‘ఇ’, ‘వి’ బ్యాండ్లలో మొబైల్ టవర్ల మధ్య సిగ్నల్స్ ప్రసారానికి బ్యాక్‌హాల్ స్పెక్ట్రమ్‌కి డిమాండ్ విపరీతంగా ఉంది. అన్ని వాణిజ్య, నివాస, కార్యాలయ ఆవరణల్లో టెలికాం సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అనుబంధ కేబ్లింగ్, ఇన్-బిల్డింగ్ సొల్యూషన్లను తప్పనిసరి చేయాలని ముసాయిదా ప్రతిపాదించింది. దీనికోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు సవరణ తీసుకురావాలని సంకల్పించింది. ఉపగ్రహ కమ్యూనికేషన్ విధానాన్ని సవరించాలని కూడా ముసాయిదా ప్రతిపాదించింది. దేశంలో రిజిస్టరైన మేధాపరమైన ఆస్తి హక్కులతో కూడిన ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. 

Related Posts