విజయవాడ
విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందు తున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని టీడీపీ అధినేత చంద్రబాబు పరామ ర్శించారు. మూడు రోజుల క్రితం బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురవడంతో ఆయనను కుటుంబ సభ్యులు రమేష్ ఆసుపత్రికి తరలిం చారు. నేడు చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ, బోండా ఉమ ఉన్నారు. బచ్చుల అర్జునుడు త్వరగా కోలుకో వాలని చంద్రబాబు ఆక్షాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చంద్రబాబు సూచించారు. బచ్చుల అర్జునుడు ఆరోగ్యం నిలకడగా ఉందని చంద్రబాబుకు వైద్యులు చెప్పారు.