విజయవాడ
కేంద్ర గెజిట్ పై మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రాజెక్టులపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కి గెజిట్ కి ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలి. వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతవరకైనా పోరాడతామని అయన అన్నారు.