హైదరాబాద్ జూలై 17
తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ పార్టీ ఫిరాయించడంతో ఇప్పుడు కొత్త బాస్ ఎవరన్న అంశంపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ చీఫ్ పదవి సీనియర్ నేతకు ఇవ్వాలా..? లేక దూకుడుగా ఉండే నేతకు అప్పగించాలా..? అని చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో చంద్రబాబు వర్చువల్ సమావేశాలు జరిపి అభిప్రాయాలు సేకరించారు. మెజార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు సూచించినట్లు సమాచారం.అయితే వయసుమెడ పడిన రావుల తను అద్యక్షుడిగా కొనసాగాలేనని చెప్పినట్లు సమాచారం. కాగా షాద్ నగర్ మాజీ ఎంఎల్ఏ బక్కని నర్సింహులు,మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అరవింద్ కుమార్ కు దేవేందర్ గౌడ్ అండదండలు లబించ నున్నాయి. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.