YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???*

*మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???*

భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం,సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం _ కల్యాణ మాపాదయన్ !!

-- ఆదిశంకరుల వారు --

*విశేషం_ పుణ్యాహవాచనం :*

ఇది యొక శుద్ధి కర్మ , ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై ఉంచి మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని పొందుతారు...

*తాత్పర్యము :*

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను చుట్టి , సంతోషము అనే నీటితో నింపిన నామనస్సు అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.

*( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం )*

*వివరణ:*

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ, అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు  పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా చల్లాలి... ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు...

అలాగే భక్తుల,హృదయాలు అరిషడ్వర్గాలతో, అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు...

శంకరులు ఇలా అన్నారు...

ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప, దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదించాలి...

దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి, పుణ్యాహవాచన కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను.  ముందుగా కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.   నామనస్సనే కలశం ప్రసన్నంగా  స్వచ్ఛంగా వుంది... 

కలశానికి దారాలు ఛుట్టాలి, నేను నాభక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను. 

నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను...

కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు  దొరికిన ఆ చిగుళ్ళు...

అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 

నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను, ఇంక కలశంపై ఒక ఫలం ఉంచాలి...

నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను.  తరువాత మంత్రాలు చదవాలి.   నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని చదువుతాను.  ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ, వాక్కూ పవిత్రమవుతాయి.  ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన  చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలని,  ఈ శ్లోకం ద్వారా శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.

Related Posts