YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అధికార మదంతో నియంతలా పాలన సాగిస్తున్న జగన్: శ్రీరాం చినబాబు

అధికార మదంతో నియంతలా పాలన సాగిస్తున్న జగన్: శ్రీరాం చినబాబు

అమరావతి జూలై 18,
సీఎం జగన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్‌‌పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా పోరాటం చేస్తున్నా కనీసం ప్రభుత్వం చర్చలకు పిలవలేదన్నారు. 19వ తేదీ సీఎం‌ నివాసం ముట్టడికి అన్ని పక్షాల మద్దతు తమకు ఉందన్నారు. అధికార మదంతో జగన్ నియంతలా పాలన చేస్తున్నారని శ్రీరాం చినబాబు విమర్శించారు. నలుగురు‌ షాడో సీఎంలు‌ చెప్పినట్లే  జగన్ రెడ్టి వింటాడన్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి... ఇప్పుడు చేసిందేమిటని ప్రశ్నించారు. రివర్స్ టెండర్ అన్న జగన్.. మాట తప్పను, మడమ తిప్పను అనే విషయంలో కూడా రివర్స్‌లో వెళుతున్నారని శ్రీరాం చినబాబు పేర్కొన్నారు.

Related Posts