హైదరాబాద్
తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా బక్కిని నరసింహులు పేరు ఖరారు అయింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్. రమణ టీఆర్ఎస్ చేరిని విషయం తెలిసిందే. దాంతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని భర్తీ చేశారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గానూ పని చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అధ్యక్షుడిగా, 1994 నుంచి 99 వరకు షాద్నగర్ ఎమ్మెల్యేగా నర్సింహులు పని చేశారు.