ఏలూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిం చారు.అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులపై ఆరా దీశారు.పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించా రు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం జగన్.. అధికారులను అడిగి తెలుసుకు న్నారు.స్పిల్వే, అప్రోచ్ ఛానల్ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు.పోలవరం ప్రాజెక్టు పరిశీలన లో వెల్లడైన అంశాల ఆధారంగా అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారు లకు దిశానిర్దేశం చేశారు.