YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజూరాబాద్ ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్న కేసీఆర్

హుజూరాబాద్ ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్న కేసీఆర్

సిరిసిల్ల జూలై 20
రాష్ట్రంలో 18 ఎస్సి రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా హుజూరాబాద్ నుండే దళితబంధు ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని బిజెపి దళిత మోర్చా  చందుర్తి మండలం అద్యక్షుడు లింగం పల్లి బాబు డిమాండ్ చేసారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఎదుర్కోలేకనే ఇవన్నీ హుజూరాబాద్ నుండి ప్రారంభించడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. కేవలం హుజూరాబాద్ లో ఎలక్షన్ కోసండ్రామా మొదలు పెట్టిండు. ఈ ఎలక్షన్ స్టంట్ లు చేస్తున్న  తెలంగాణ ముఖ్యమంత్రి సిగ్గుండాలని అన్నారు.కృష్ణా నీళ్ల పంచాయతీ, దళిత సాధికారత పేరుతో అఖిలపక్షం, ఇప్పుడు ఫ్యామిలీకి 10 లక్షలు. ఇవన్నీ హుజురాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్.ఆడుతున్న డ్రామాలు అని యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. 1.దళితుడే ముఖ్యమంత్రి అన్నవ్...పాయే, 2.దళితులకు 3ఎకరాల భూమి అన్నవ్...పాయే, 3.అంబేద్కర్ విగ్రహం అన్నవ్...పాయే, ఇప్పుడు దళిత సాధికారత అంటున్నవ్. నీకు ఎన్నికలు జరగబోయే హుజూరాబాద్లనే దళితులు కనవడ్తున్నరా రాష్ట్రం మొత్తం కనవడ్తలేరా?అని ప్రశ్నించారు.

Related Posts