పేదింటి ఆడబిడ్డలకు భరోసా సీఎం కేసీఆర్
ఎమ్మెల్యే డాక్టర్ .సంజయ్ కుమార్
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల జూలై 20
కల్యాణలక్ష్మీ ,షాదీముభారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లీలకు సీఎం కేసీఆర్ భరోసాగా నిలుస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గీతా భవన్ జరిగిన సమావేశంలో పట్టణ,అర్బన్ మండలానికి చెందిన 79 మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 79 లక్షల 9 వేల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ చేతులమీదుగా పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వెంట మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్ , కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.