YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

యువతులపై యాసిడ్ దాడి

యువతులపై యాసిడ్ దాడి

రాచకొండ పోలీసు కమిషనరేటు పరిధిలో మరోసారి ప్రేమోన్మాదం పడగ విప్పింది. తనను పట్టించుకోవడం మానేసిందని ప్రియురాలిపై యాసిడ్తో దాడికి దిగాడు ఓ ప్రేమికుడు. హయత్నగర్ నివాసంలో ఉంటున్న ఝాన్సీ, శంకర్లు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఝాన్సీ తనను పట్టించుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు శంకర్. ఝాన్సీ స్నేహితురాలు రమ్య తన గురించి చెడుగా చెప్పడం వల్లనే తనకు దూరంగా ఉంటుందని శంకర్ కక్ష్య పెంచుకున్నాడు. ఝాన్సీ, రమ్య  ఇద్దరూ ఒక పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు. 

దీంతో ఇద్దరిపై కోసం పెంచుకున్న శంకర్, బుధవారం రాత్రి  పెట్రోల్ పంపులో విధులు ముగించుకుని తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా యాసిడ్తో దాడికి పాల్పడ్డాడు. ఆ యాసిడ్ కాన్సెంట్రేటెడ్ కాకపోవడంతో వీరికి ప్రమాదం తప్పింది. 

Related Posts