YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వీహెచ్ ను పరామర్శించిన దత్తాత్రేయ

వీహెచ్ ను పరామర్శించిన దత్తాత్రేయ

హైదరాబాద్
ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ రాజ్య సభ సభ్యుడు వి. హనుమంతరావు ను అంబర్ పేట లోని తన నివాసంలో హర్యానా రాష్ట్ర గవర్నర్  బండారు దత్తాత్రేయ పరామర్శించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిని వీహెచ్  ఇటీవలే  ఇంటికి తిరిగివచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ  మాట్లాడుతూ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం షిమ్లా లో గవర్నర్ గా ఉన్న నేను హనుమంతరావు  అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారని మీడియా ద్వారా తెలుసుకున్నాను.. ఆ తర్వాత హర్యానా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీలు చూసుకొని హనుమంతరావును  పరామర్శించడానికి వచ్చానని అన్నారు. హనుమంతరావు  నా చిరకాల మిత్రుడు. హనుమంతరావు  మృదు స్వభావి, తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి. ఆలాంటి వ్యక్తి త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు..

Related Posts