YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు పధకాన్ని తెరాస శ్రేణులు పాల్గోనాలి

రైతు బంధు పధకాన్ని తెరాస శ్రేణులు పాల్గోనాలి

రైతులకోసం ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం హర్షిస్తుందని తెరాస రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం నాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబంధు పధకం ద్వారా ఇచ్చే చెక్కులు, సాధాబైనామా ద్వారా ఇచ్చే పట్టాదారు పాసుపుస్తకాలు ఈ నెల 10వ తారీఖునుండి  పంపిణి చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞంలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమై, రైతు కండ్లల్లో ఆనందం కురిసే విధంగా తెలంగాణ రాష్ట్రమంతా ప్రతి పల్లెల్లో నిర్వహింపబడుతుందని అన్నారు.  60ఏండ్ల కాంగ్రేస్ పాలనలో ఎన్నడూ చూడని ఆనందం రైతుల ఇంట్లో చూడబోతున్నామని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతీ తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొనని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ప్రజల్లో ఆనందం నింపుతున్నాయో ప్రతిపక్ష పార్టీలన్నింటికీ తెలిసొచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.  గ్రామాల్లో మండల కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా మమేకమై ఈ రైతుల పండుగను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ జెర్రిపోతుల వెంకన్న,సీనియర్ తెరాస జిల్లా నాయకులు మంగళంపల్లి కన్నా,మాచర్ల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts