తాడేపల్లి
సీఎం నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరకట్ట వెంబడి ఉన్న అమరా రెడ్డి నగర్ కాలనీ నిర్వాసితులను పరామర్శకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వచ్చారు. నిర్వాసితులు ఉన్న ప్రదేశాలు వెళ్లేందుకు అనుమతి లేదని రామకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సిపిఐ రామకృష్ణ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ రాజధానిని ఇక్కడ ఉండటం లేదు నేను విశాఖపట్నం వెళ్లిపోతున్నా అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అలాంటపుడు సెక్యురిటి నెపంతో పేదల ఇళ్లు ఎందుకు తొలిగిస్తున్నారు. గతంలో ప్రతిపక్షం నేతగా ఉన్నపుడు సెక్యూరిటీ ఎందుకు గుర్తురాలేదు. ప్రతిఒక్కరికి న్యాయం చేయాలని, నిర్వాసితులకు ప్రతిఒక్కరికి ఇళ్ళు స్థలాలు కేటాయించి కొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేసారు.