ఉద్యానవనాలు అందంగా తయారు చేశారు
టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి జూలై22,టీటీడీ పరిపాలన భవనం సముదాయంలో ఉద్యాన వనాలు అందంగా తయారుచేసి మంచి మొక్కలు నాటారని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను అభినందించారు.
పరిపాలన భవనంలోని ఉద్యాన వనంలో గురువారం ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, లాన్ చక్కగా తయారు చేశారన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత ఎవరికైనా అప్పగించాలన్నారు. అంతకుముందు ఆయన
ఎస్ఈ కార్యాలయంలో పూర్తి చేసిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. కార్యాలయాల వెనుకవైపు గోడలకు సున్నం కొట్టించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు