YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ కి డిపాజిట్లు కుడా రావు : ఎమ్మెల్యే బొండా ఉమ

బీజేపీ కి డిపాజిట్లు కుడా రావు : ఎమ్మెల్యే బొండా ఉమ

వై ఎస్ జగన్ వెనక వుండిబీజేపీ నేతలు  లాలూచి వ్యవహారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. రాష్ట్రం  లో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. వైకాపా గ్రాఫ్ పెరిగింది అని బీజేపీ నాయకులూ అంటున్నారు. అయితే, మీరు వెళ్లి వైసీపీలో జాయిన్ అవుతారా అని నిలదీసారు. గురువారం నాడు అయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన టీడీపీ అధికారంలోకి రావటం ఖాయం. బీజేపీ ఎంపీ జీవీఎల్  నర్సింహారావు మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే వద్దు అంటుంది అని ప్రచారం చేస్తున్నారు. అసలు ఎప్పుడు నిధులు ఇస్తాం అన్నారు... ఇంకా ఎంత కాలం రాష్ట్ర ప్రజలని మోసం చేస్తారని ప్రశ్నించారు. మీకు రాష్ట్రం లో వైకాపా  అండగా వుందనే ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం వైఫల్యం వాల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  బ్యాంకులో  డబ్భులు లేవు...ఎవరి దగర డబ్బులు లేవని అన్నారు. టీడీపీ మ్యానిఫేస్టో లో 95శాతం అమలు చేసింది. బీజేపీ వాళ్ళ మ్యానిఫేస్టో లో 45శాతం కూడా అమలు చేయ లేకపోయారని విమర్శించారు.  కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎవరు బీజేపీ కి ఒక ఓటు  కుడా వెయ్యరు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కి ప్రతీకారం తీర్చుకునేందుకు కర్ణాటక ఓటర్లు సిద్ధంగా వున్నారు. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయక పోయిన అందరి సహకారం తో ముందుకు తీసుకుకొస్తునం. బీజేపీ స్వ లాభం కోసం గాలి జనార్ధన్ రెడ్డిని, జగన్ ని వాడుకుంటుంది.  బీజేపీ కి రాష్ట్రం లో డిపాజిట్లు కూడా రావని అయన అన్నారు. 

Related Posts