హైదరాబాద్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని బాల నగర్ చౌరస్తా లోజరిగిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు పాల్గోన్నారు. అక్కడ మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐ డి పి ఎల్ వద్దనుండి ఫిరోజ్ గూడ వరకు రహదారి డివైడర్ పై మొక్కలు నాటారు. మంత్రి తలసాని మాట్లాడుతూ మంత్రి జోగినిపల్లి సంతోష్ రావు పిలుపుమేరకు ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటామని అన్నారు. మరోసారి యంగ్ డైనమిక్ లీడర్ కే టి రామారావు గారి జన్మదినం సందర్భంగా ముక్కోటి చర్చలో భాగంగా మొక్కలు నాటి జన్మదిన వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేశామని ఇటువంటి యంగ్ డైనమిక్ లీడర్ యువతకు ఆదర్శం అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమంగా హరితహారాన్ని చేపట్టిందని, ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నప్పుడల్లా మొక్కలు నాటి వాటిని పెంచాలని ఆయన సూచించారు.ఈ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, ఇతర అధికారులు పాల్గొన్నారు.