హైదరాబాద్
మాజీ ఎంపి వి. హనుమంతరావు శనివారం మీడియాతో మాట్లాడారు. నా ఆరోగ్యం విషయంలో మా సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరు నన్ను పరామర్శించారు . చాల మంది హాస్పిటల్స్ కి వచ్చి నన్ను కలవడానికి వచ్చారు అందరకి కృతజ్ఞతలని అన్నారు. బడుగు బలహీన వర్గాల వాళ్లకి నా సేవలు అవసరమని మా సోనియాగాంధీ తెలిపారు. రాజకీయాల్లో కి సేవ చేయాలని వచ్చాను ..అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదు. సోనియా గాంధీ నాతో మాట్లాడటం వల్ల నాకు మరింత దైర్యం పెరిగింది. నా మిగతా జీవితం అంత బడుగు బలహిన వర్గాలకి సేవ చేస్తానని అన్నారు. ఎక్కడ పేదవారికి ఆపద ఉన్న ఆదుకునే పవన్ కళ్యాణ్ నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాసారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. ఎక్కడ ఆపద ఉన్నా అక్కడ నేను ఉంటాను. మా నాయకురాలిని కలిసిన తరువాత కొత్త కమిటీ, పాత కమిటి గురుంచి మాట్లాడతాను. అప్పటివరకు ఎం మాట్లాడానని అన్నారు.