విశాఖపట్నం
రాష్ట్రం లో వైసిపీ ప్రభుత్వ పాలన కు వ్యతిరేకంగా విశాఖ లో ఆగ్రహ జ్వాలలు అలముకున్నాయి. గడిచిన రెండేళ్ళ పాలన లో కేవలం సంక్షేమం మాత్రమే చేస్తూ అభివృద్ధి ని తుంగలో తొక్కారని విమర్శిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం, ఏడు గుడుల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అద్వానం గా వున్నాయని, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.