శ్రీశైలం
శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఘంటా మఠం, లాలితాంభిక దుకాణ సముదాయాన్ని పరిశీలించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలంలో అన్యమత రాజకీయ నాయకులు బినామీ పేర్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. శ్రీశైలంలో అన్యమతస్థుల ఇళ్లను దేవాలయ ప్రదేశం నుంచి తొలగించాలి. అన్యమతస్థులకు శ్రీశైలం వెలుపల ఇళ్ళు నిర్మించాలని అయన అన్నారు. లాలితాంభిక దుకాణాలను అద్దెకు ఇవ్వడం లేదు, వేలం నిర్వహించడం లేదు. జగన్ ప్రభుత్వానిది హిందూ వ్యతిరేక వైఖరి. ఓటు బ్యాంక్ కోసం క్రిస్టియన్, ముస్లింల కు తాయిలాలు, టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో హిందువులకు భద్రత ఉందా. గోవులను రక్షించే చట్టాన్ని చెత్తది గా అభివర్ణిస్తారా. గోవుల చట్టంపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తీరుపై ముఖ్యమంత్రి వైఖరి చెప్పాలని సోము వీర్రాజు అన్నారు.