సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన ఆహార భద్రత కార్డుల పంపిణి ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పట్టించుకోని ప్రతి పక్ష నాయకులను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం అంత కన్నా లేదు. ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రానికి యాజమానుల్లా కాకుండా.. ఇంకా బానిసలుగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ లో ప్రతి పేదవాడి కడుపు నిండాలన్నదే కెసిఆర్ లక్ష్యం. ఓట్ల రాజకీయం కోసమే. ప్రతీ పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో మరో ఆదర్శ పధకంగా దళిత బంధు నిలు స్తుందని అన్నారు.