హైదరాబాద్
అవ్వ పెట్టది అడక్కు తిననీయది అన్నట్టే ఉంది కేసీఆర్ దొర తీరని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాలలో పంటలను నష్టపోయారు రైతులు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి గత సంవత్సరం రాష్ట్రప్రభుత్వం తప్పుకుంది. సొంత పంటల బీమా పాలసీని తీసుకొస్తాం అని గొప్పగా చెప్పిన ఇంతవరకు తీసుకురాలేదని ఆమె ట్వీట్టర్ ద్వారా విమర్శించారు. దీనితో రైతులకు అటు కేంద్రం బీమా వర్తించక ..ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక .. రైతు కష్టాలు పడుతున్నడు .. నష్టాల పాలౌతున్నడు. ఇప్పుడైనా మేలుకోండి సీఎం సారు అని ఆమె వ్యాఖ్యానించారు.