YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరెన్సీ నోట్ల ముద్రణ ఆలోచన లేదు

కరెన్సీ నోట్ల ముద్రణ ఆలోచన లేదు

కరెన్సీ నోట్ల ముద్రణ ఆలోచన లేదు
న్యూఢిల్లీ, జూలై 26, 
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నోట్ల ముద్రణ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో కరెన్సీ నోట్ల ముద్ర అంశం కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నోట్ల ముద్రణ అంశంపై స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ల ముద్రణపై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు.కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కరెన్సీ నోట్లను ముద్రించాలనే ఆలోచన తమకు లేదని నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. అయితే చాలా మంది ఆర్థిక వేత్తలు, ఆర్థిక నిపుణులు మాత్రం కరెన్సీ నోట్లను ముంద్రిస్తే బాగుంటుందని, కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.అయితే నిర్మలా సీతారామన్ మాత్రం నోట్ల ముద్రణ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, పరిస్థితులు సర్దుకుంటున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో పయనిస్తోందని నిర్మలా సీతారామన్ వివరించారు.

Related Posts