ఆనాధ ఆడబిడ్డలకు ఎన్ఆర్ఐ10 వేల రూ. ఆర్థిక సహాయం
జగిత్యాల జూలై 27
జిల్లా లోని బుగ్గారం మండల కేంద్రంలోని చుక్క రమేష్ అతని భార్య చుక్క జలజ లు ఇద్దరూ నెల రోజుల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. వీరి సంతానమైన ఇద్దరు ఆడ పిల్లలు తల్లిదండ్రులు లేని అనాధలయ్యారు.ఎన్ఆర్ఐ దుబాయ్ లో ఉన్న బుగ్గారం వాస్తవ్యులు బొడ్డు రమేశ్ - సంగీత లు సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకొని స్పందించారు.వారి కుమార్తె "'అవని"' జన్మదినం సందర్భంగా బొడ్డు రమేష్ తల్లిదండ్రులు అయిన బొడ్డు మల్లయ్య - రాజవ్వ ల ద్వారా రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. వీరి ఆర్థిక సహాయాన్ని చూసి చిన్నారి అనాధ పిల్లలైన చుక్క సంధ్య, నాగలక్ష్మి లు రోధించగా వారిని బొడ్డు రమేష్ తల్లిదండ్రులు బొడ్డు మల్లయ్య - రాజవ్వ లు ఓదార్చి మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం వైస్ ఎంపిపి జోగినిపెళ్లి సుచెందర్, బొడ్డు చంద్రయ్య - కవిత, చుక్క లక్ష్మి, రాములపల్లికి చెందిన మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.