YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

జ్యూడిషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా

జ్యూడిషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా

జ్యూడిషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా
ముంబై, జూలై 27, 
పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడు, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు రాజ్‌కుంద్రాకు 14 రోజుల పాటు జ్యూడిషియల్‌ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పోర్నోగ్రఫి కేసులో రాజ్‌ కుంద్రా అరెస్ట్ అనంతరం.. పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో పోలీసులు రాజ్‌కుంద్రాను ముంబై కోర్టులో హాజరుపర్చారు. పోర్నోగ్రఫి రాకెట్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. కస్టడీకి అప్పగించాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు ధర్మాసనం రాజ్‌కుంద్రాకు 14 రోజులపాటు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పోర్నోగ్రఫీ కేసులో ఈ నెల 19న రాజ్‌ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత.. క్రైం బ్రాంచ్ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే.. రాజ్‌ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్‌ను సైతం మార్చాడని క్రైమ్ బ్రాంచ్‌ దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాజ్‌ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్‌ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫి కేసుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్‌ షెర్లిన్ చోప్రాకు సోమవారం ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. మంగళవారం తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
ప్లాన్ బీని ముందే అమలు చేసిన రాజ్
గ్రఫీ చిత్రాల కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా (బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త) చీకటి వ్యవహారాల చిట్టా విప్పుతున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. తప్పు చేస్తున్నందున పోలీసులు తనను అరెస్టు చేయొచ్చని రాజ్ కుంద్రా ముందే పసిగట్టాడు. ఆ మేరకు పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కొన్ని మాసాల ముందే పథక రచన చేశాడు. ప్లాన్ బీ‌లో భాగంగా తన పాత మొబైల్ ఫోన్‌ను మార్చి నెలలో ఎక్కడో విసిరికొట్టాడు. కొత్త ఫోన్ వాడటం మొదలుపెట్టాడు. పాత ఫోన్‌లో డేటా పోలీసుల చేతికి చిక్కకుండా రాజ్ కుంద్రా ఈ ఎత్తుగడవేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో నిర్థారించారు. రాజ్ కుంద్రా కేసును దర్యాప్తు జరుపుతున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాలు వెల్లడించింది.కేసు విచారణలో భాగంగా పాత ఫోన్ ఎక్కడుందని రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించగా..దాన్ని పడేసినట్లు కుంద్రా సమాధానమిచ్చినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. పోర్నోగ్రఫీ చిత్రాల కేసులో రాజ్ కుంద్రా ప్రమేయాన్ని నిరూపించేందుకు అవసరమైన పలు ఆధారాలు ఆ పాత ఫోన్‌లో ఉండే అవకాశముందన్నారు. సదరు పాత ఫోన్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల జాయింట్ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపారు. పోర్నోగ్రఫీ చిత్రాలను ప్రసారం చేసే హాట్‌షాట్స్, బాలీ ఫేమ్ యాప్స్ ద్వారా వచ్చే ఆదాయం ఈ జాయింట్ అకౌంట్‌కు వచ్చేదని అనుమానం వ్యక్తంచేశారు.ఈ కేసులో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రాజ్ కుంద్రా దగ్గర పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసులో సాక్ష్యులుగా మారడం తెలిసిందే. వారి ద్వారా రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించగలమని ముంబై క్రైం బ్రాంక్ పోలీసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రాజ్ కుంద్ర పోలీస్ కస్టీ ముగియడంతో మంగళవారం ఆయన్ను ముంబైలోని కోర్టు ఎదుట హాజరుపర్చారు. మరో వారం రోజుల పాటు పోలీసు కస్టడీని పొడగించాలన్న ముంబై పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు… కుంద్రాను 14 రోజుల(ఏప్రిల్ 10 వరకు) జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉందగా రాజ్ కుంద్ర బెయిల్ పిటిషన్ బుధవారం కోర్టులో విచారణకు రానుంది.

Related Posts