YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజకీయ పార్టీల మధ్య మాటలపోరు మోదీ ప్రోగ్రెస్‌ కార్డుకు ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ప్రకటించిన రాహుల్‌

రాజకీయ పార్టీల మధ్య మాటలపోరు మోదీ ప్రోగ్రెస్‌ కార్డుకు ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ప్రకటించిన రాహుల్‌

కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న నేపద్యం లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటలపోరు బలపడుతోంది. గురువారం తాజాగా కాంగ్రెస్‌జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీపై ట్వీట్ల దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం విషయంలో మోదీ ప్రోగ్రెస్‌ కార్డుకు తాను ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ఇస్తానంటూ ట్వీట్ చేశారు.దీంతో పాటు మద్దతు ధరకు సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్‌ చేశారు.ఈ సందర్భంగా రాహుల్‌ ‘ మోదీజీ.. కర్ణాటకలోని వ్యవసాయం అనే సబ్జెక్ట్‌గాను గానూ మీ రిపోర్ట్‌ కార్డ్‌. 8,500 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు అందిస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. ప్రధానమంత్రి పంటలబీమా పథకంలోనూ రైతులకు అన్యాయమే జరిగింది. దీని వల్ల ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకే మంచి లాభాలొచ్చాయి. కర్ణాటక రైతులకు మద్దతు ధర కూడా కల్పించలేదు. ఈ అన్ని అంశాల్లోనూ కలిపి నేను మీకిస్తున్న గ్రేడ్‌ ‘ఎఫ్‌’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు 2017-18 ఖరీఫ్‌ సీజన్‌ మార్కెటింగ్‌ సంబంధించిన మద్దతు ధర చార్ట్‌ను రాహుల్ ట్విటర్‌లో పంచుకున్నారు.రెండు రోజుల క్రితం మోదీ ఉడుపి పర్యటనలో భాగంగా...రాహుల్‌పై విమర్శానాస్త్రాలు సంధించిన విషయం విదితమే. తర్వాత రాహుల్‌ ఇలా ట్వీట్ చేయడం గమనార్హం.  

Related Posts