గురువారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన సరుకుల గురించి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను మరియు మార్కెటింగ్ అధికారులను మంత్రి హరీష్ రావు అప్రమత్తం చేసారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులను మరియు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, యింట్ కలెక్టర్లను ఆదేశించారు. టార్పాలిన్ లను వెంటనే సమకూర్చి తడవని సరుకులను వెంటనే గోదాం లకు తరలించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.