దేవరకొండ
దక్షిణ తెలంగాణలో నిధులు లేక నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల పనులను సమీక్షిస్తున్నారు వామ పక్ష నేతల బృందం. సీనియర్ జర్నలిస్ట్, కె శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నల్గొండ జిల్లా డిండి కి చేరుకున్న సిపిఐ నేతలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు.నక్కల గండి,ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనుల జాప్యత పై ప్రాజెక్ట్ ఇంజినీర్ లతో చర్చిస్తున్నారు.అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెళ్ళెంల ఉదయ సముద్రం పనులను పరిశీలించనున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై నిపుణుల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది.