విశాఖపట్నం
గోవధ నిషేధ చట్టంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.జగన్ అందించే ప్రశం సల కోసం నేతలు అత్యుత్సాహం ప్రదర్శింస్తున్నారంటూ విశాఖలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎం సీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు , బీజేపీ నేతలు పాల్గొని వైసీపీ నేతలు తీరును ఎండ గట్టారు.హిందువుల మనోభా వాలు దెబ్బ తీసే విధానం వ్యవహారించిన చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.