YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 18 మంది మృతి

లక్నో జూలై 28
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్‌ డెక్కర్‌ బస్సును ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.  హర్యాణా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బిహార్‌ వెళ్తోంది. ఈ క్రమంలో బారాబంకి రామ్‌ స్నేహి ఘాట్ కొత్వాలి ప్రాంతంలోని లక్నో – అయోధ్య జాతీయ రహదారిపై బస్సు ఆగి ఉండగా.. లక్నో వైపు నుంచి వస్తున్న ట్రక్కు వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Related Posts