YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అంబెద్కర్ విగ్రహన్ని బయటకు తీయాలి

అంబెద్కర్ విగ్రహన్ని బయటకు తీయాలి

హైదరాబాద్
దళితులు ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచనను  బాగుందని కాంగ్రెస్ నేత  వి హనుమంతరావు మెచ్చుకున్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల తరువాత మొట్టమొదటి సారి అంబెడ్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నానని అయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరి పది లక్షలు  ఇస్తేనే కేసీఆర్ దళిత భాందవుడవు అవుతావు. కేసీఆర్ ప్రభుత్వమే పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహం తీసి దళిత , బహుజనులు ద్రోహం చేసింది. అంబెడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం లాకప్ లో పట్టింది. ఎన్ని ఆందోళనను చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
అంబెడ్కర్ విగ్రహాన్ని లాకప్ లో పెట్టి దళిత బంధు అంటే ఎవరు నమ్మరు. కేవలం హుజురాబాద్ లో దళిత బంధు అమలు చేస్తే ఉప ఎన్నికల కోసమని భావిస్తారు. ష్ట్రంలో ఉన్న దళితులందరికి దళితబందు అమలు చేస్తేనే కేసీఆర్ కు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తాం. హుజురాబాద్ ఉప ఎన్నికలకంటే ముందే లాకప్ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం ఇవ్వాలి. అప్పుడే కేసీఆర్ ను దళితుల. పట్ల ప్రేమ ఉన్నట్టు నమ్ముతామని అన్నారు.
అంబెడ్కర్ విగ్రహం కోసం అన్ని పార్టీలు ఆందోళన చేయాలని డిమాండ్ చేస్తున్నా. అంబెడ్కర్ విగ్రహం పంజాగుట్టలో పెట్టేవరకు నా పోరాటం కొనసాగుతుంది. దళితులకు భోజనం పెట్టి , ఫొటోకు దండవేస్తె అంబెడ్కర్ పై చిత్తశుద్ధి ఉన్నట్లు కాదు. అంబెడ్కర్ విగ్రహం తేవడమే నేను చేసిన తప్పా...? మా పార్టీలో అంబెడ్కర్ విగ్రహం కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేసినా.  ఎందుకో మా పార్టీ వాళ్ళు వైఎస్ విగ్రహం. పక్కన అంబెడ్కర్ విగ్రహం పెట్టిదని భావిస్తున్నారో ఏమో.. అందుకే మా పార్టీ నేతలు మాట్లాడడం లేదు. అంబెడ్కర్ విగ్రహం ఇవ్వకపోతే..సీఎం కేసీఆర్ ది దళితుల పై కపట ప్రేమ అని మేము భావిస్తామని అన్నారు.

Related Posts